A Thread On Why Capital Politics Have Been An Major Concern Only In AP !
40 ఏళ్ళ విషనరీ అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎం గా ఉన్నప్పుడు,హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను ఎలా తమ బినామీలకు కట్ట పెట్టాలి అని, హైటెక్ సిటీ కట్టడం, బిల్ గేట్స్ ని పిలుచుకురావడం, ఆయన కట్టబెట్టిన లక్షల
40 ఏళ్ళ విషనరీ అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎం గా ఉన్నప్పుడు,హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను ఎలా తమ బినామీలకు కట్ట పెట్టాలి అని, హైటెక్ సిటీ కట్టడం, బిల్ గేట్స్ ని పిలుచుకురావడం, ఆయన కట్టబెట్టిన లక్షల
కోట్ల విలువైన హైదరాబాద్ లో భూములు మీద రీసర్చ్,థీసిస్ లు చూసి దోచుకోవడం ఎలా అనే విద్య అన్నీ రాజకీయ పార్టీలకు ఒక పాఠం గా మారింది ! ఈ దోపిడీ,అన్నీ ప్రాంతాల వనరులు హైదరాబాద్ లో కేంద్రీకరణ చేసి తన వారికి, బినామీలకు కట్టబెట్టడమే తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కారణం !అందులో వైయస్ కూడా
50/50 వాటాదారులుగా ఉండడం మాములే ! రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు హైదరాబాద్ నిర్ణయింపడిన తరువాత, బీజీపీ,జనసేన, దయతో విడిపోయిన రాష్ట్రానికి ఒక అనుభవ నాయకుడు అవసరం అని,జగన్ కి అనుభవ లేమి ఉండడం వల్ల మోడీ గారి సలహాతో బాబుకు మద్దత్తు ఇచ్చారు రెండు పార్టీల వారు! గెలిచిన
తరువాత ఉమ్మడి రాజధాని ఉండగా, ఓటు కి నోటు కేసులో డబ్బులు ఇస్తూ పట్టుబడి,తెలుగు జాతి ఆత్మ గౌరవం ముసుగులో ఎల్లో మీడియా సహాయంతో అర్ధ రాత్రి అమరావతికి వచ్చేసారు బాబుగారు !విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా మన హక్కు అయినా, ప్యాకేజి బహు బాగు అని హోదా తాకట్టు పెట్టాడు బాబుగారు!హోదా లో
కట్టి రాష్ట్రానికి ఇవ్వాలి! అందుకు బాబుగారు కేంద్రం కడితే 10 ఏళ్ళు దోచుకోవడానికి దూరంగా ఉన్న తమకు, మరో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లూటీ చేసే హక్కు కోల్పోతాము అని తెలిసి, డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటాం అని కేంద్రాన్ని ఒప్పించాడు! పచ్చని నాలుగు పంటలు పండే భూములు అయితే రైతుల జీవితాలు
తన పార్టీ భవిష్యత్కి భీమా లాగా ఉంటుంది అని, ఎందరో నిపుణులు చెప్పినా, పవన్కళ్యాణ్ రోడ్డెక్కినా, రైతులకు అర చేతిలో స్వర్గం చూపించి, వాళ్ళ భూములను తీసుకుని రాజధానిని కట్టాలని నిర్ణయించుకున్నాడు!ప్రజలకు గ్రాఫిక్స్, అమరావతి రైతులకు తాత్కాలిక భవనాలతో సినిమా చూపించాడు!
కేంద్రం ప్రభుత్వం 75% ప్యాకేజీ నిధుల బిల్లులు, ప్రజలకి ఎలా ఖర్చు పెట్టారో లెక్కలు అడగగానే,కుల మీడియాతో దుమ్మెత్తి పొయ్యడం, ఆత్మ గౌరవ సభలు, అంటూ జనాలను మభ్య పెట్టాడు !ప్యాకేజి లోని 80% డబ్బులు బినామీలు,తమ వారికి కట్ట బెట్టి, అమరావతిలో కనీసం ఒక ఆసుపత్రి, బడి, విద్యాలయం కూడా
కట్టలేదు అంటే అమరావతి పై బాబుకు ఉన్న ప్రేమ అర్థం అవుతుంది!ఈ అవకతవకలు పైన కేంద్రం సీబీఐ విచారణ అనగానే, తెలుగు వారి ఆత్మగౌరవం పై దాడి,అని కాంగ్రెస్ తో చేతులు కలిపాడు బాబోరు !ఎన్నికల్లో ఎలాగో ఓటమి తప్పదు అని సర్వేలు, గ్రౌండ్ రిపోర్టులు రాగానే, ఇక తన పార్టీకి సంజీవిని
అమరావతికి చట్టబద్ధత తెస్తే ఇక తనకు తన పార్టీకి రాజకీయ బ్రతుకు లేదని తెలిసే,చట్టబద్దత పక్కన పెట్టాడు!ఎన్నికలు వచ్చాయి బాబుగారి పార్టీ ఘోరంగా ఓటమి పాలు అవ్వడం, అనుకున్నట్లే జగన్ రాజధాని మార్పు చేపట్టడం, సీన్ లోకి అమరావతి హీరోగా కుల మీడియా చేత బాబు గారు రీ ఎంట్రీ ఇవ్వడం,హంగు
అన్నీ అయ్యాక ఇవాళ్టి డెడ్ లైన్ అయ్యాక, కనీసం రాజీనామా కూడా చెయ్యకుండా ప్రజలను పోరాడామనడం!వచ్చే ఎన్నికలకు అమరావతి రాజధాని అంశమే తమ పార్టీ సంజీవిని అని చెప్పడం ! కుళ్ళు, కుతంత్రాలు, దోపిడీ, దుర్మార్గపు రాజకీయాల్లో చంద్రబాబు విషనరీ అని అమరావతి ప్రజలు ఇంకా తెలుసుకోకపోవడం దౌర్భాగ్యం!
అమరావతిని ముంచింది, దోచుకుంది, రైతుల, వారి బిడ్డల జీవితాలను తన పార్టీ జీవనానికి వాడుకున్న చంద్రబాబు కారకుడా?ప్యాకేజిలో భాగంగా ఇచ్చిన డబ్బులను ఏం చేసారు అని అడిగిన మోడీ కారకుడా? భూములు చట్టబద్దత లేకుండా ఇవ్వకండి మిమ్మల్ని మోసం చేస్తారు బాబు, జగన్ ఇద్దరూ అన్న పవన్కళ్యాణ్ కారకుడా?
ఇప్పటికైనా అమరావతి ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఇద్దరి 60:40 రాజకీయాలను అర్థం చేసుకోని జాగ్రత్త పడకుంటే,ఎన్ని బీజేపీలు, జనసేనలు వచ్చినా న్యాయం వంద శాతం జరగదు !